News April 12, 2024

ప.గో: UPDATE.. భర్త డెడ్‌బాడీ లభ్యం

image

ప.గో జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి వంతెనపై నుంచి రెండేళ్ల చిన్నారి సహా దంపతులు దూకి గల్లంతైన విషయం తెలిసిందే. కుటుంబ యజమాని బొంతు కిషోర్ మృతదేహాన్ని గురువారం సాయంత్రం గుర్తించారు. భార్య యోచన, కుమార్తె శ్రీనిధి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ దంపతులు పాపతో సహా గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. భీమవరానికి చెందిన వీరు 3 నెలల కింద అమలాపురానికి జీవనోపాధి నిమిత్తం వెళ్లారు.

Similar News

News March 5, 2026

ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

image

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

News March 5, 2026

9న భీమవరం వస్తున్న షర్మిల!

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

News March 5, 2026

ప.గో: బైక్ ఢీకొని యువకుడి మృతి

image

నరసాపురం మండలం సీతారామపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణ కోల్పోయారు. శేరేపాలెం గ్రామానికి చెందిన చిలకపాటి జేమ్స్ (32) హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాళీపట్నంకు చెందిన సంజీవరావు తన బైక్‌తో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జేమ్స్ నరసాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.