News November 13, 2025

కరీంనగర్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

కరీంనగర్ పద్మనగర్ బైపాస్ రోడ్డులోని ముద్దసాని గార్డెన్స్ ముందు రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట గ్రామానికి చెందిన గడ్డం ఈశ్వర్(35) స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఇతడి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో లారీ టైర్ కింద పడ్డ ఈశ్వర్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 13, 2025

విజయవాడలో దారుణ హత్య

image

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. విజయ టాకీస్ సమీపంలోని విన్స్ హాస్పిటల్లో పనిచేసే మహిళను ఆమె భర్త గురువారం మధ్యాహ్నం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ ఆలీ తెలిపారు.

News November 13, 2025

వరంగల్: మహిళల భద్రత కోసం షీ బాక్స్..!

image

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు వరంగల్ పోలీసు శాఖ మహిళలకు స్ఫూర్తిదాయక పిలుపునిచ్చింది. ఏ మహిళైనా పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే లేదా అలాంటి ఘటనను గమనించినా, వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న SHe-Box వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.

News November 13, 2025

భూ కబ్జా ఆరోపణలు.. పవన్‌కు వైసీపీ సవాల్

image

AP: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ కబ్జా పేరిట <<18274471>>Dy.CM పవన్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని YCP మండిపడింది. ‘ఈ భూములన్నీ 2000-2001 మధ్య కొన్నవి కాదా? ఇవి నిజాలు కావని నిరూపించగలరా’ అని పవన్‌కు సవాల్ విసురుతూ డాక్యుమెంట్ల వివరాలను Xలో షేర్ చేసింది. ‘పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా’ అని పేర్కొంది.