News April 12, 2024
కోడ్ ముగిసిన తర్వాతే ‘గృహజ్యోతి’కి కొత్త దరఖాస్తులు

TG: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే గృహజ్యోతి(ఫ్రీ కరెంట్)కి కొత్త అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత 36లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లులు జారీ చేశారు. రాష్ట్రంలో 86లక్షలకు పైగా అర్హులు ఉండటంతో మిగిలినవారి నుంచి దరఖాస్తులను కోడ్ ముగిసిన వెంటనే స్వీకరించనున్నారు. గతనెల జీరో బిల్లు జారీ చేసిన 36లక్షల కుటుంబాలకు ఈనెల యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
Similar News
News November 5, 2025
OFFICIAL: కమల్ ప్రొడక్షన్లో రజినీ సినిమా

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News November 5, 2025
టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు: బీఆర్ నాయుడు

AP: గత ఏడాది కాలంలో TTDకి రూ.1000Cr విరాళాలు వచ్చాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఛైర్మన్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఎయిర్పోర్టుగా నామకరణం చేస్తాం’ అని పేర్కొన్నారు.
News November 5, 2025
షమీకి మరోసారి నిరాశ.. రీఎంట్రీ కష్టమేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. NOV 14 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్కు BCCI ప్రకటించిన <<18208501>>జట్టులో<<>> ఆయనకు చోటు దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్కూ ఆయన్ను సెలక్ట్ చేయని సంగతి తెలిసిందే. దీంతో షమీ కెరీర్ ముగిసినట్లేనా అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల రంజీ ట్రోఫీలో ఆయన 3 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టారు.


