News November 13, 2025
కరీంనగర్ ‘టాస్క్’లో రేపు జాబ్ డ్రైవ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో గల ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న(రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఈ డ్రైవ్ చేపడుతున్నారు. 2024-25లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 9 గంటలకు ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలని వారు సూచించారు.
Similar News
News November 13, 2025
ఊట్కూర్: వే2న్యూస్ ఎఫెక్ట్.. PHC కూల్చివేతకు ఆదేశాలు

ఊట్కూర్ మండల కేంద్రంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారింది. ‘శిథిలావస్థగా PHC భవనం..’Way2News’ ఫోకస్! ‘ శీర్షికతో ఈ నెల 1న కథనం ప్రచురితమైంది. గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పాత భవన నాణ్యతను నిపుణులతో పరిశీలించి ధ్రువీకరించిన అనంతరం కూల్చివేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించింది.
News November 13, 2025
హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్లతో రైళ్లు!

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.
News November 13, 2025
వైజాగ్కు మదర్సన్ ఐటీ కంపెనీ

మదర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ (MTSL) కంపెనీ ₹109.73 కోట్ల పెట్టుబడితో వైజాగ్లో ఐటీ R&D, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడ (కాపులుప్పాడ ఐటీ పార్క్)లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా AI/ML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో 700 ఉద్యోగాలు వస్తాయి. AP IT & GCC పాలసీ 4.0 కింద G.O.MS.No. 61 (12-11-2025) జారీ చేసింది.


