News November 13, 2025

రామగిరి: సింగరేణి భూసేకరణ, పరిహారంపై కలెక్టర్ సమీక్ష

image

సింగరేణి భూసేకరణ పనులను సజావుగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి పరిహారాలను త్వరగా చెల్లించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం రామగిరి తహశీల్దార్ కార్యాలయంలో భూసేకరణ అంశాలపై ఆయన సమీక్షించారు. సింగరేణి సంస్థ అవసరమైన వివరాలు అందించినందున, ఎస్.డీ.సీ., తహశీల్దార్, ఎంపీడీఓ, సింగరేణి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News November 13, 2025

ఊట్కూర్: వే2న్యూస్ ఎఫెక్ట్.. PHC కూల్చివేతకు ఆదేశాలు

image

ఊట్కూర్ మండల కేంద్రంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారింది. ‘శిథిలావస్థగా PHC భవనం..’Way2News’ ఫోకస్! ‘ శీర్షికతో ఈ నెల 1న కథనం ప్రచురితమైంది. గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పాత భవన నాణ్యతను నిపుణులతో పరిశీలించి ధ్రువీకరించిన అనంతరం కూల్చివేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించింది.

News November 13, 2025

హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్‌లతో రైళ్లు!

image

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్‌లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్‌లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్‌లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.

News November 13, 2025

వైజాగ్‌కు మదర్‌సన్ ఐటీ కంపెనీ

image

మదర్‌సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ (MTSL) కంపెనీ ₹109.73 కోట్ల పెట్టుబడితో వైజాగ్‌లో ఐటీ R&D, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడ (కాపులుప్పాడ ఐటీ పార్క్)లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా AI/ML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో 700 ఉద్యోగాలు వస్తాయి. AP IT & GCC పాలసీ 4.0 కింద G.O.MS.No. 61 (12-11-2025) జారీ చేసింది.