News November 13, 2025

NRPT: ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి

image

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలని రాష్ట్ర అల్ మేవ అధ్యక్షుడు షేక్ ఫరూక్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నారాయణపేట మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసి అనేక అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. మైనారిటీ పాఠశాల, కళాశాలలో నియామకాలను కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని కోరారు.

Similar News

News November 13, 2025

HYD: రాబోయే రోజుల్లో చెమట సుక్కలే..!

image

ఏటా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. మహానగరంలో నిర్మాణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కాంక్రీట్ జంగల్‌గా మారుతుంది. ఈ నేపథ్యంలో గత పదేళ్ల రిపోర్టును పరిశీలించిన అధికారులు రాబోయే రోజుల్లో 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.

News November 13, 2025

గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్ అబ్దుల్ సాద్ ఊనైస్

image

గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా అబ్దుల్ సాద్ ఊనైస్ ఎంపికయ్యాడు. అబ్దుల్ సాద్ ఊనైస్ బాపట్ల వాసి. రేపు శుక్రవారం నుంచి సెంట్రల్ జోన్ అండర్-14 జోన్ మ్యాచ్లు జరగనున్నాయి. చిన్న వయసు నుంచే క్రికెట్‌లో సత్తా చాటుతున్న అబ్దుల్ సాద్ గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల పలువురు క్రికెట్, క్రీడా ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 13, 2025

HYD: సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీల వైపు మళ్లింది?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని BRS వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కొందరిని భయపెడుతుంటే మరికొందరిని సంతోషంలో ముంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో అనుకూలంగా వచ్చినవారు గెలుపు ఖాయమనే ధీమాతో కార్యకర్తలతో మాట్లాడుతూ జోష్ ప్రదర్శిస్తుండగా.. సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీ వైపు మళ్లిందనేది రేపు తేలనుంది.