News November 13, 2025

యాదగిరిగుట్ట: ప్రొటోకాల్ దర్శనాలపై కీలక నిర్ణయాలు

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రొటోకాల్ దర్శనాలపై దేవస్థానం ఈవో వెంకట్రావు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. గురువారం దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రొటోకాల్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న 3 రోజుల పాటు ఏజెంట్లు, రిఫరెన్స్ ఫోటో కాల్స్ పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

Similar News

News November 14, 2025

అనకాపల్లి: ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలి’

image

అనకాపల్లి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థలు, ట్రస్టులు,సొసైటీలు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి మనోహర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో 10 లక్షల జనాభాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ నకలు, ఇతర అటాచ్మెంట్లు అందజేయాలన్నారు. దరఖాస్తు చేసే సంస్థలకు మూడేళ్ల ఆడిట్ రిపోర్ట్ ఉండాలన్నారు.

News November 14, 2025

తిరుమల: సాఫీగా ఇంటర్వ్యూలు

image

TTD వేద పారాయణదారుల పోస్టుల ఇంటర్వ్యూల్లో అకడమిక్ అబ్జర్వర్ తీరు గత మూడు రోజులుగా చర్చకు దారి తీసింది. ఈ మెయిల్స్ ద్వారా ఆయనపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయం Way2Newsలోనూ రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. అబ్జర్వర్ పని మాత్రమే చేయాలని, ఇతర పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో గురువారం సాఫీగా ఇంటర్వ్యూలు జరిగాయి.

News November 14, 2025

చెత్త సేకరణ సక్రమంగా జరగాలి: కర్నూలు కలెక్టర్

image

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని కర్నూలు కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలు చెత్త సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయని, వెంటనే మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 63 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.