News November 13, 2025

భద్రాద్రి జిల్లాలో 83,850 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు

image

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సమగ్ర కార్యచరణ అవసరమన్నారు. 23 మండలాల్లో 21,329 మంది రైతులు 83,850 ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 14,500 ఎకరాల లక్ష్యంలో 8,163 ఎకరాలకు చేరామన్నారు.

Similar News

News November 14, 2025

అనకాపల్లి: ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలి’

image

అనకాపల్లి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థలు, ట్రస్టులు,సొసైటీలు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి మనోహర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో 10 లక్షల జనాభాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ నకలు, ఇతర అటాచ్మెంట్లు అందజేయాలన్నారు. దరఖాస్తు చేసే సంస్థలకు మూడేళ్ల ఆడిట్ రిపోర్ట్ ఉండాలన్నారు.

News November 14, 2025

తిరుమల: సాఫీగా ఇంటర్వ్యూలు

image

TTD వేద పారాయణదారుల పోస్టుల ఇంటర్వ్యూల్లో అకడమిక్ అబ్జర్వర్ తీరు గత మూడు రోజులుగా చర్చకు దారి తీసింది. ఈ మెయిల్స్ ద్వారా ఆయనపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయం Way2Newsలోనూ రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. అబ్జర్వర్ పని మాత్రమే చేయాలని, ఇతర పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో గురువారం సాఫీగా ఇంటర్వ్యూలు జరిగాయి.

News November 14, 2025

చెత్త సేకరణ సక్రమంగా జరగాలి: కర్నూలు కలెక్టర్

image

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని కర్నూలు కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలు చెత్త సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయని, వెంటనే మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 63 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.