News November 13, 2025
A1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

మంగళంపేటలో 75.74ఎకరాలకే పట్టాలు ఉండగా.. పెద్దిరెడ్డి కుటుంబం 32.63ఎకరాల అటవీ భూమిని తమ స్థలంలో కలిపేసుకున్నారని PCCFచలపతిరావు వెల్లడించారు. ‘ఏ1గా మిథున్ రెడ్డి, ఏ2గా రామచంద్రా రెడ్డి, ఏ3గా ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా ఇందిరమ్మ పేర్లు నమోదు చేశాం. అటవీ భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేసి ఆదాయం పొందారు. చట్ట విరుద్ధంగా బోర్ వెల్ తవ్వారు. రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లింది’ అని ఆయన చెప్పారు.
Similar News
News November 14, 2025
అనకాపల్లి: ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలి’

అనకాపల్లి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థలు, ట్రస్టులు,సొసైటీలు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి మనోహర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో 10 లక్షల జనాభాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ నకలు, ఇతర అటాచ్మెంట్లు అందజేయాలన్నారు. దరఖాస్తు చేసే సంస్థలకు మూడేళ్ల ఆడిట్ రిపోర్ట్ ఉండాలన్నారు.
News November 14, 2025
తిరుమల: సాఫీగా ఇంటర్వ్యూలు

TTD వేద పారాయణదారుల పోస్టుల ఇంటర్వ్యూల్లో అకడమిక్ అబ్జర్వర్ తీరు గత మూడు రోజులుగా చర్చకు దారి తీసింది. ఈ మెయిల్స్ ద్వారా ఆయనపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయం Way2Newsలోనూ రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. అబ్జర్వర్ పని మాత్రమే చేయాలని, ఇతర పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో గురువారం సాఫీగా ఇంటర్వ్యూలు జరిగాయి.
News November 14, 2025
చెత్త సేకరణ సక్రమంగా జరగాలి: కర్నూలు కలెక్టర్

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని కర్నూలు కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలు చెత్త సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయని, వెంటనే మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 63 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.


