News November 13, 2025
ఆదిభట్లలో ఏసీబీ రైడ్.. అయిజలో కలకలం

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ ఆఫీస్లో గురువారం ఏసీబీ అధికారులు రైడ్ చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ను పట్టుకున్నారు. అయితే అతడు అయిజ మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తూ ఆదిభట్ల, ఆమనగల్ మున్సిపాలిటీలకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను ACB అధికారులు పట్టుకున్న వార్త అయిజలో కలకలం సృష్టించింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ నడుస్తుంది.
Similar News
News November 14, 2025
కామారెడ్డిలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ‘కిడ్స్ విత్ ఖాకీ’

కామారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9:30 గంటలకు నిజాంసాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ స్కిట్, అనంతరం 10:30 గంటలకు ట్రాఫిక్ ప్లెడ్జ్, అలాగే విద్యార్థులకు పోలీస్ స్టేషన్లలో జరిగే విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
News November 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 14, 2025
వరంగల్: 24 అంతస్తుల్లో హాస్పిటలే ఉంటుంది: డీఎంఈ

వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల్లో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని డీఎంఈ డా.నరేంద్ర కుమార్ తెలిపారు. ఆసుపత్రికి బదులుగా ఐటీ హబ్ అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, త్వరలోనే సనత్ నగర్ టిమ్స్, వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


