News April 12, 2024
భరోసాగా మారండి.. భారంగా కాదు

కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఎవరూ ఫెయిల్ కావాలని, మార్కులు తక్కువ రావాలని పరీక్షలు రాయరు. కానీ అనుకోని ఫలితం ఎదురైతే ఒత్తిడికి గురయ్యే యువ హృదయాలకు తల్లిదండ్రులు అండగా నిలవండి. నిరాశ చెందే మీ పిల్లలకు జీవితం అంటే ఇది మాత్రమే కాదని, ఇక్కడితోనే అంతా ఆగిపోదని భరోసానివ్వండి. భయాందోళనలో ఉండే మీ పిల్లలను కనురెప్పల్లా కాపాడుకోండి తప్ప.. భరించలేని భారంగా వారికి కన్పించవద్దని మనవి.
Similar News
News January 20, 2026
ఒకే రోజు రూ.22వేలు పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే <<18903989>>కేజీ<<>> వెండిపై రూ.22వేలు పెరిగి రూ.3,40,000కు చేరింది. కేవలం 10 రోజుల్లోనే వెండి ధర రూ.65వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలనిచ్చింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,130 పెరిగి రూ.1,48,370, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,950 ఎగబాకి రూ.1,36,000 పలుకుతోంది.
News January 20, 2026
షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News January 20, 2026
NIT వరంగల్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


