News April 12, 2024
రోడ్డు ప్రమాదంలో దంపతులు స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కొత్త పల్లె సమీపంలో గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాలకు చెందిన గంగావరపు రాజగోపాల్ రెడ్డి కుటుంబంతో గుంటూరులో ఉంటున్నాడు. బ్యాంక్ పనుల నిమిత్తం నంద్యాలకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు గుంటూరు-కర్నూల్ జాతీయ రహదారిపై చెట్టును ఢీకొంది. ప్రమాదంలో రాజగోపాల రెడ్డి, లక్మీ దేవి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 21, 2026
కర్నూలు: ఎయిడెడ్ పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి డీఈవో సుధాకర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దుపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల్లో ఈనెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 21, 2026
ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలోని రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పంటలో రైతులకు అధిక దిగుబడి, లాభాలు వచ్చేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి పాల్గొన్నారు.
News January 21, 2026
ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలోని రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పంటలో రైతులకు అధిక దిగుబడి, లాభాలు వచ్చేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి పాల్గొన్నారు.


