News November 15, 2025

మైలు, అంటు తగలని పవిత్ర వస్తువులు ఇవే..

image

☞ సహజ క్రిమి సంహారిణి అయిన ‘పసుపు’. ☞ లక్ష్మీ రూపంగా భావించే ‘కుంకుమ’. ☞ ప్రకృతి నుంచి నేరుగా లభించే ‘పూలు’. ☞ పవిత్ర ఆహారంగా దేవుడికి సమర్పించే ‘పండ్లు’. ☞ పూజా ద్రవ్యాలలో ముఖ్యమైన ‘తమలపాకు’. ☞ గోవు నుంచి లభించే శుభ్రమైన ‘పాలు, పెరుగు’. ☞ మధురమైన, సహజ ఔషధమైన ‘తేనె’. ☞ సమస్త దోషాలు తొలగించే ‘తులసి’. ☞ శిరస్సును చల్లబరిచే శుద్ధ పదార్థమైన ‘గంధం’. ☞ యజ్ఞాలలో వాడే పవిత్ర ద్రవ్యమైన ‘నెయ్యి’. SHARE IT

Similar News

News November 15, 2025

ఇకనైనా ‘వలస’ జీవులకు విముక్తి లభించేనా?

image

బిహార్‌లో మరోసారి ఎన్డీఏ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది తిరిగి తమ ఉపాధి క్షేత్రాలకు తిరిగిరానున్నారు. ఈక్రమంలో ఏళ్లు గడుస్తున్నా వలస జీవుల బతుకులు మారట్లేదని, ప్రజలకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇకనైనా కంపెనీలు నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు.

News November 15, 2025

APPLY NOW: RRUలో 9 పోస్టులు

image

గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<>(RRU<<>>) 9 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ (గ్రాఫిక్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, మల్టీ మీడియా ఆర్ట్స్), LLM, BSc(నర్సింగ్), NET/SLET/SET, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rru.ac.in

News November 15, 2025

మొత్తం పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లు: CBN

image

AP: CII సదస్సు ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని CM CBN ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.22లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని స్పష్టం చేశారు.