News April 12, 2024
మంజీరా తీరంలో నెగ్గేదెవరో..?

2008లో ఏర్పడిన మంజీరా తీరంలో జహీరాబాద్ లోక్సభకు ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం KA, MH ఆనుకొని ఉండటంతో కన్నడ శైలి.. మరాఠీల ప్రత్యేకత చాటుతుంది. ఇక్కడ లింగాయత్, మరాఠా సామాజిక వర్గాలదే ఆధిపత్యం. 2009 ఎన్నికల్లో సురేశ్ షెట్కార్, 2014, 19లో బీబీ పాటిల్ గెలవగా.. ఇద్దరిది లింగాయత్ సామాజిక వర్గమే. ఈసారి వీరితోపాటు BRS అభ్యర్థిగా గాలి అనిల్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీల్లో నెగ్గేదెవరో వేచి చూడాల్సిందే.
Similar News
News March 6, 2026
కమ్మర్పల్లి ప్రాంతంలో పులి సంచారం

మహారాష్ట్రలోని తాడోబా నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. బీట్ ఆఫీసర్ శ్రీదేవి ఈ పులిని ప్రత్యక్షంగా చూశారని తెలిసింది.
News March 6, 2026
NZB: నేడు BJP పార్లమెంట్ స్థాయి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం

NZB పార్లమెంట్ స్థాయి BJP విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలో నూతనంగా గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. మాధవ్ నగర్ లోని కమ్మ సంఘంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, NZB MP అర్వింద్ ధర్మపురి, MLA లు హాజరవుతున్నారు.
News March 5, 2026
NZB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు: డీఎంహెచ్వో

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మాతా శిశు మరణాలతో పాటు నెల లోపు శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడంపై చర్చించారు.


