News November 15, 2025

సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం కోసం ఎదురుచూపులు

image

సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు మొత్తం 7,680 యూనిట్లు కేటాయించగా, 7,121 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరికి స్వయం ఉపాధి కోసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. ఆరు నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడంతో యువతలో నిరాశ నెలకొంది.

Similar News

News November 15, 2025

భూపాలపల్లి: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

భూపాలపల్లి జిల్లా చిట్యాల, గణపురం(ములుగు), మల్హర్‌రావు, మహాముత్తారం, పలిమెల, టేకుమట్ల, మహదేవ్‌పూర్ నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.

News November 15, 2025

డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం పార్వతీపురం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరుగుతుందని అందుకు తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.

News November 15, 2025

వట్టి నేలపై కూర్చోకూడదా?

image

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>