News November 15, 2025

విశాఖలో వర్చువల్‌గా రేమండ్ గ్రూప్ ప్రాజెక్ట్‌ల శంకుస్థాపన

image

విశాఖలో 2వ రోజు CII సమ్మిట్‌‌లో CM చంద్రబాబు రేమండ్ గ్రూప్ ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1201 కోట్లతో మూడు ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆ సంస్థల డైరెక్టర్ గౌతమ్ మైనీ తెలిపారు. రాప్తాడులో రూ.479.67 కోట్లతో అప్పెరెల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, అనంతపురం (D) గుడిపల్లిలో ఆటో మాన్యుఫాక్చరింగ్ కాంపొనెంట్ ప్లాంట్, టెకులోదు వద్ద గ్లోబల్ ఎరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ వస్తోందన్నారు.

Similar News

News November 15, 2025

కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

image

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.

News November 15, 2025

రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

image

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.

News November 15, 2025

తండ్రయిన రాజ్‌కుమార్

image

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.