News November 15, 2025

అనంత జిల్లాలో రేమండ్ గ్రూప్ ప్రాజెక్టుల శంకుస్థాపన

image

CII సమ్మిట్‌‌లో CM చంద్రబాబు రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1201 కోట్లతో 3 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆ సంస్థల డైరెక్టర్ గౌతమ్ మైనీ తెలిపారు. అనంతపురం(D) రాప్తాడులో రూ.479.67 కోట్లతో అప్పెరెల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, గుడిపల్లిలో ఆటో మాన్యుఫాక్చరింగ్ కాంపొనెంట్ ప్లాంట్, శ్రీ సత్యసాయి(D) టెకులోడు వద్ద గ్లోబల్ ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ వస్తోందన్నారు.

Similar News

News November 15, 2025

తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

News November 15, 2025

పెద్దపల్లి: NOV 14 – 20 వరకు సహకార వారోత్సవాలు

image

PDPL జిల్లాలో NOV 14-20 వరకు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ప్రతిరోజు ప్రత్యేక అంశాలపై కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. డిజిటలైజేషన్‌, గ్రామీణాభివృద్ధి, సహకార విద్య, మహిళ-యువత సాధికారత, గ్రీన్ ఎనర్జీ, టూరిజం వంటి విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సహకార అధికారి శ్రీమాల పాల్గొన్నారు.

News November 15, 2025

GWL: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

image

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం ఐడీఓసీ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా జరగాలన్నారు. రైతులకు ముందస్తుగా తేమశాతం పై ఏఈఓ లు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన పత్తి, ధాన్యం కేంద్రానికి వచ్చే విధంగా చూడాలన్నారు.