News April 12, 2024
రాజాంలో భారీగా నగదు పట్టివేత

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐ దాడి మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం రాజాం మండలం పొగిరి చెక్ పోస్ట్ వద్ద పాలకండ్యం నుంచి రాజాం వెళ్తున్న కారులో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.5,23,300 గుర్తించారు. సంబంధిత నగదుకు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Similar News
News September 10, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

➤నరసన్నపేట: గ్యాస్ లీకై.. వ్యాపించిన మంటలు
➤పాతపట్నం: బురదలో కూరుకుపోయిన లారీ.. ట్రాఫిక్ జామ్
➤టెక్కలి: మండుటెండలో విద్యార్థుల అవస్థలు
➤ఎచ్చెర్ల: అంబేడ్కర్ వర్శిటీ నూతన రిజిస్ట్రార్గా అడ్డయ్య
➤సరుబుజ్జిలి: ధర్మల్ ప్లాంట్ను వ్యతిరేకించిన ఆదివాసీలు
➤శ్రీకాకుళం: 11న డయల్ యువర్ ఆర్ఎం
➤ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్
News September 10, 2025
SKLM: 11న డయల్ యువర్ ఆర్ఎం

స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసే క్రమంలో అవగాహన కోసం డైల్ యువర్ ఆర్టీసీ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్ అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 11న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు 99592 25603 నంబర్కు ఫోన్ చేయాలన్నారు.
News September 10, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ఊరట

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా హైదరాబాద్(HYB)- భువనేశ్వర్(BBS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB- BBS రైలును ఈ నెల 16 నుంచి NOV 25 వరకు ప్రతి మంగళవారం, నం.07166 BBS- HYB మధ్య నడిచే రైలును నేటి (బుధవారం) నుంచి NOV 26 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.