News April 12, 2024

కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించిన కలెక్టర్

image

VZM : వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కోరారు. మే 13న జరిగే ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతం చేసినట్లు ఆమె తెలిపారు. కలెక్టరేట్ పోర్టికోవద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్బంగా కొత్తగా ఓటు హక్కు పొందేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు.

Similar News

News January 16, 2026

రామభద్రపురంలో పండకొచ్చిన అల్లుడికి 101 వంటకాలతో విందు

image

రామభద్రపురం మండల కేంద్రం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన నూతన జంట పూసర్ల వెంకట సాయికుమార్, పద్మావతి దంపతులను అత్తవారు మొదటి సంక్రాంతి పండగకు ఆహ్వానించారు. 101 రకాల వంటకాలను ఇవాళ తయారు చేసి పెద్ద అరటి ఆకులో కొత్త అల్లుడికి వడ్డించారు. ఇలా సంప్రదాయంగా వంటకాలు పెట్టిన బొడ్డు నాగ సైనకుమార్, సత్య దంపతులను పలువురు కొనియాడారు.

News January 16, 2026

గరివిడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

image

గరివిరి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండగ నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై లోకేశ్వరరావు, సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సిబ్బందికి స్వీట్స్ అందజేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

News January 16, 2026

గుర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

image

గుర్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు . పండగ సందర్భంగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి క్షేమంగా గమ్యస్థానం చేరే విధంగా చూడాలని ఎస్సై నారాయణరావుకు సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.