News November 15, 2025

ఖమ్మం: వ్యక్తి మృతి.. అకౌంట్ నుంచి డబ్బు మాయం

image

చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి ఫోన్‌పే ద్వారా పలు దఫాలుగా నగదు కాజేసిన ఘటన సత్తుపల్లిలో జరిగింది. హనుమాన్ నగర్‌కు చెందిన ఆలేటి ప్రసాద్ 3 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రసాద్‌ ఫోన్ నుంచి ఫోన్ పే ద్వారా కొందరు దుండగులు రూ.3 లక్షలు కాజేశారు. కుటుంబ సభ్యులకు బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయగా.. అకౌంట్‌లో ఉన్న నగదు మొత్తం బదిలీ అయిందని చెప్పడంతో షాక్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 15, 2025

గద్వాల్: స్థానిక ఎన్నికలకు ఊపందుకోనున్న వేగం

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వేగం పుంజుకోనుంది. ఈ నెల 17న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా గద్వాల్ జిల్లాలో 13 జడ్పీటీసీ 13 ఎంపీపీ, 142 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, హైకోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

News November 15, 2025

కామారెడ్డి: ‘ఆహార భద్రత నిబంధనలు పాటించండి’

image

కామారెడ్డిలో ఆహార భద్రత నిబంధనల అమలుపై ఆహార భద్రత నియోజిత అధికారి శిరీష శనివారం పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు దుకాణాల్లో ఉల్లంఘనలను గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటించని దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులు తప్పనిసరిగా లేబులింగ్ నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News November 15, 2025

KCRతో KTR భేటీ.. జిల్లాల పర్యటనలు చేయాలని ఆదేశం!

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఇవాళ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. BRS ఓటమికి గల కారణాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని KTRను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో BRS ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.