News November 15, 2025

జగిత్యాల: ‘గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా’

image

భగవాన్ బిర్సా 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత మాట్లాడుతూ.. బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ‘ధర్తీ ఆబా’గా ప్రజల హక్కులు, గిరిజన సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.

News November 16, 2025

‘గీత కార్మికుల హామీలు నెరవేర్చాలి’

image

కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా మహాసభలో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న సూర్యాపేటలో రణభేరిని నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.

News November 16, 2025

మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.