News November 15, 2025
మల్యాల: ‘కొనుగోలు కేంద్రాల్లో వసతులు మెరుగుపరచాలి’

మల్యాల మండలం కొండగట్టు, ముత్యంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత శనివారం పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి అదేరోజు రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు వివరాలు వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు.
Similar News
News November 16, 2025
STRANGE: ఈ ఊరిలో 450 మంది ట్విన్స్

ఒక ఊరిలో పది మంది కవలలు ఉంటేనే ఆశ్చర్యంగా చూస్తుంటారు. అలాంటిది 2వేల మంది జనాభా ఉన్న కేరళలోని ‘కొడిన్హి’లో ఏకంగా 450 జతల కవలలు ఉంటే ఇంకెలా ఉంటుంది. అక్కడ కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం అంతుచిక్కని విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, జన్యు శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్దిష్టమైన కారణాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే వలస వచ్చిన కుటుంబాలకూ కవలలు జన్మించడం విచిత్రం.
News November 16, 2025
పెద్దపల్లి: డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మె

PDPL కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజనకార్మికులు ధర్నా చేపట్టి ముట్టడి చేశారు. ప్రభుత్వాలు మారినా సమస్యలకు పరిష్కారం లేకపోవడంతో కార్మికుల జీవనం కష్టాల్లో ఉందని జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర సరుకులు అందజేయడం, నెలకు ₹10,000 గౌరవవేతనం, పెండింగ్ బకాయిలు చెల్లించడం వంటి డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు
News November 16, 2025
పెద్దపల్లిలో డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష

PDPL కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి.వేణు మాదకద్రవ్యాల నియంత్రణపై శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. టీనేజ్ పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన 10 పడకల డీ-అడిక్షన్ సెంటర్ను సద్వినియోగం చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


