News November 15, 2025

పెద్దపల్లి: పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. రైతులు కలెక్టర్ సూచన

image

CCI జిన్నింగ్ మిల్లులపై విధించిన నిబంధనల సడలింపు వచ్చే వరకు NOV 17నుంచి రాష్ట్రవ్యాప్తంగా CCI, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ తెలిపారు. రైతులు మార్కెట్‌ యార్డులకు, జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకురావొద్దని, స్లాట్ బుకింగ్ ఉన్నవారూ కూడా పత్తి తీసుకురావొద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పత్తి అమ్మకాలపై రైతులు ఆగాలని కలెక్టర్ విజ్ఞప్తిచేశారు.

Similar News

News November 16, 2025

KNR: విటమిన్ గార్డెన్ పై దృష్టి పెట్టాలి:కలెక్టర్

image

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్‌లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్‌ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.

News November 16, 2025

KNR: ‘కుక్కకాటు బాధితులకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరం’

image

కుక్కలు, కోతులు కరిచిన వారికి అందిస్తున్న చికిత్సపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారని వారికి సూచించారు.

News November 16, 2025

KNR: SRR కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

image

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని జంతు శాస్త్ర విభాగం ప్రథమ సంవత్సర విద్యార్థులు జిల్లా కేంద్రంలోని జింకల పార్కును క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. వారి పాఠ్యాంశంలోని వివిధ రకాల పక్షులను జంతువులను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. ఈ క్షేత్ర పర్యటనలో జంతుశాస్త్ర విభాగాధిపతి డా.కిరణ్మయి, రవీందర్ రావు, డా.టి.మహేష్, సమత, ప్రీతి, సాయి చరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.