News April 12, 2024

MBNR: ఆ ఓటర్లపై స్పెషల్ ఫోకస్ !

image

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో 16,80,417, నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో 17,34,773 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రత్యేక కేటగిరీ ఓటర్లు అయిన దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు, 18-10 ఏళ్ల యువత, ఎన్ఆర్ఐ, సర్వీస్ ఓటర్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ 5 కేటగిరీల ఓటర్లు ఉమ్మడి జిల్లాలో 2,10,388 మంది ఉన్నారు.

Similar News

News April 22, 2025

నేడే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

image

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922 సెకండియర్‌లో 11,561 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఇంటర్మీడియట్ ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.- ALL THE BEST

News April 22, 2025

నాగర్‌కర్నూల్: రంపంతో భర్త గొంతు కోసిన భార్య..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు ఉంటున్నారు. ఈనెల 19న భార్యతో కురుమయ్య గొడవపడ్డాడు. అదేరోజు రా.11 గంటలకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో వెళ్లి రంపం బ్లేడ్ తీసుకొచ్చి కురుమయ్య గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.

News April 22, 2025

మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలి: ఉపకులపతి

image

పాలమూరు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ & బీసీ సెల్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. వారి జీవితం, ఆచరణ, సేవలు, దేశం కోసం చేసిన త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలిచాయని, ఈ మహానీయుల జీవిత చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్పుతుందని అన్నారు. ఎస్పీ D. జానకి, యూనివర్సిటీ అధ్యాపకులు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!