News November 16, 2025

కిలిమంజారోను అధిరోహించిన అనంత జిల్లా యువతి

image

అనంతపురం(D) నార్పల(M) దుగుమర్రికి చెందిన కె.కుసుమ(19) ఈ నెల 8న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీస్టాండింగ్ పర్వతం కిలిమంజారో (5895M)ను 12న విజయవంతంగా అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాతో పాటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, MLA బండారు శ్రావణి ఫొటోలను ఎగురవేసింది. 15న హైదరాబాద్‌కు చేరుకోనుంది.

Similar News

News November 16, 2025

GNT: పవన్ కళ్యాణ్‌పై అంబటి సెటైరికల్ ట్వీట్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీమంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా చురకలంటించారు. “విశాఖ CIIసమ్మిట్‌లో చిన్న కమ్మ కళ్యాణ్ గారు కనిపించలేదేంటబ్బ.?’ అంటూ అంబటి పోస్ట్ చేశారు. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు అంబటిపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News November 16, 2025

MBNR:U-14,19..17న వాలీబాల్ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 19 విభాగాల్లో బాల, బాలికలకు బాస్కెట్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 17న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ మెమో(U-19), బోనఫైడ్, ఆధార్‌ జిరాక్స్ పత్రాలతో ఉ.9:00 గంటలలోపు పీడీ శైలజకు రిపోర్ట్ చేయాలన్నారు.SHARE IT.

News November 16, 2025

ములుగు: జిల్లాలో సమస్యలపై స్పందన కరవు!

image

జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సమస్యలపై స్పందన కరవైందని, ఎలాంటి సమస్య ఉన్న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పత్రికలు, సోషల్ మీడియాలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న తనకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సరైన విచారణ, చర్యలు లేకకపోవడం అధికారుల పనితనానికి నిదర్శనం.