News November 16, 2025

వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

image

కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. రాజన్నకు మొక్కుకున్న కోడె మొక్కును భీమేశ్వరాలయంలో చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News November 16, 2025

3Dలోనూ అఖండ-2

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

సంగారెడ్డి: పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

image

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సంగారెడ్డి, మెదక్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు సంగారెడ్డిలో జరిగాయి. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా జట్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్లు చింతా బలరాం, డా.గిరి, ఉపాధ్యక్షులు డా.శ్వేత, ఆంజనేయులు, యాదగిరి, ప్రధాన కార్యదర్శి వరప్రతాప్, సహాయ కార్యదర్శి అరుంధతి, వెంకటేశం, కోశాధికారి శివకుమార్ ఉన్నారు.

News November 16, 2025

సంగారెడ్డి: 18 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్: డీఈవో

image

ఈ నెల 18 నుంచి 20 ఖేడ్‌లోని ఈ-తక్షిలా పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ & ఇన్‌స్పైర్ అవార్డ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు రెండు సెట్ల రైట్ అప్స్, సంబంధించిన వస్తువులు తప్పనిసరిగా తీసుకురావాలని తెలియజేసారు. అలాగే మూడు రోజులకు విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులను తీసుకురావాలని సూచించారు.