News April 12, 2024
వాలంటీర్లు మా కార్యకర్తలే: మంత్రి ధర్మాన

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల మన పార్టీ కార్యకర్తలని అన్నారు. నామినేషన్ రోజు 25 మంది వాలంటీర్లను తీసుకురావాలని కోరారు. వాలంటీర్లను రాజీనామాలు చేయించండి అని కార్యకర్తలకు సూచించారు. వాలంటీర్లతో పని చేయించాలని జిల్లాలోని ఆ పార్టీ కేడర్కు సూచించారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News January 7, 2026
శ్రీకాకుళం: యువకుడిపై పోక్సో కేసు.. రిమాండ్

శ్రీకాకుళం నగరానికి చెందిన నవీన్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News January 7, 2026
ఆగని భోగాపురం మంటలు.. మీ కామెంట్

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో TDP, YCP నేతల మధ్య మాటల మంటలు ఆరడం లేదు. తమ ప్రభుత్వంలో విమానాశ్రయానికి పూర్తి అనుమతులు తెచ్చామని YCP నేతలు గట్టిగా చెప్తున్నారు. YCP హయాంలోనే 2,200 ఎకరాల్లోని అడ్డంకులు తొలగించి ప్రాజెక్టును పట్టాలెక్కించామంటున్నారు. ఈ వ్యాఖ్యలను TDP కొట్టిపారేస్తోంది. ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్ తీసుకువచ్చిన ఘనత తమదని, ప్రాజెక్టును పూర్తి చేశామని అంటోంది.
News January 7, 2026
8న అరసవల్లిలో కర్టెన్ రైజర్

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులుతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 9న ఉదయం 8గంటలకు కర్టెన్ రైజర్తో వేడుకలకు అంకురార్పణ చేస్తామన్నారు.


