News November 16, 2025
రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు

AP: రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5-15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. విద్యార్థుల వెంట పేరెంట్స్ వారి ఆధార్ కార్డును తీసుకెళ్లాలి. కాగా రాష్ట్రంలో ఇప్పటికీ 15.46 లక్షల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News March 13, 2026
ధోనీ ఆ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కరెక్ట్ కాదు: పుజారా

CSK మాజీ కెప్టెన్ ధోనీ 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్కు రావడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ పుజారా అన్నారు. ‘ధోనీ ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. కేవలం 5 లేదా10 కాకుండా 25-30 బంతులు ఆడితే జట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఆయన ముందుగా బ్యాటింగ్కు వస్తే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని అభిప్రాయపడ్డారు. 44 ఏళ్ల ధోనీ గత సీజన్లో 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
News March 13, 2026
వారు రక్తదానం చేయడంపై నిషేధం కొనసాగుతుంది: కేంద్రం

ట్రాన్స్జెండర్లు, పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషులు, సెక్స్ వర్కర్ల రక్తదానంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. HIV, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిబంధనలు అవసరమని తెలిపింది. ఇది వివక్ష కాదని స్పష్టం చేసింది. కేవలం లైంగిక గుర్తింపు ఆధారంగా రక్తదానాన్ని నిరాకరించడం చట్టవిరుద్ధమని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కేంద్రం వివరణ ఇచ్చింది.
News March 13, 2026
ఫ్లాష్ ఫ్లడ్స్ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <


