News November 16, 2025
కాకినాడ కలెక్టరేట్లో రేపు PGRS

కాకినాడ కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమానికి రాలేనివారు ఆన్లైన్లో కూడా తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News March 19, 2026
జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ పండుగల శుభాకాంక్షలు: ఎస్పీ

ఉగాది, రంజాన్ పర్వదినాల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు ఎస్పీ ఎస్.సతీశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాలు సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ సంప్రదాయాలను గౌరవిస్తూ, పరస్పర గౌరవభావంతో పండుగలను జరుపుకోవాలని సూచించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందేలా ఈ పర్వదినాలు దోహదపడతాయని తెలిపారు.
News March 19, 2026
T20 WC: BCBకి షాక్ ఇచ్చిన బంగ్లా ప్రభుత్వం!

భద్రతా కారణాలతో T20 WC నుంచి <<18951531>>తప్పుకున్న<<>> బంగ్లా క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఇండియాకు వెళ్లేందుకు జట్టు నిరాకరించడంపై విచారణ ప్రారంభించనుంది. ‘WCలో మనం ఎందుకు పాల్గొనలేదు. క్రీడా దౌత్యంలో మన లోపాలు ఎక్కడ ఉన్నాయి. వీటిని అంచనా వేయడమే విచారణ ఉద్దేశం’ అని క్రీడల శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ చెప్పారు. ఈద్ తర్వాత విచారణ కమిటీ ఏర్పాటు చేసి, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News March 19, 2026
T20 WC: BCBకి షాక్ ఇచ్చిన బంగ్లా ప్రభుత్వం!

భద్రతా కారణాలతో T20 WC నుంచి <<18951531>>తప్పుకున్న<<>> బంగ్లా క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఇండియాకు వెళ్లేందుకు జట్టు నిరాకరించడంపై విచారణ ప్రారంభించనుంది. ‘WCలో మనం ఎందుకు పాల్గొనలేదు. క్రీడా దౌత్యంలో మన లోపాలు ఎక్కడ ఉన్నాయి. వీటిని అంచనా వేయడమే విచారణ ఉద్దేశం’ అని క్రీడల శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ చెప్పారు. ఈద్ తర్వాత విచారణ కమిటీ ఏర్పాటు చేసి, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


