News November 16, 2025

కుష్ఠు వ్యాధి గుర్తింపుపై స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

image

జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధిని గుర్తించేందుకు రేపటి నుంచి 30 వరకు 14 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ డ్రైవ్‌లో ఆరోగ్య బృందాలు ప్రతి ఇంటినీ సర్వే చేస్తాయి. ​కుష్ఠును పూర్తిగా నయం చేయగలిగేదని, ప్రారంభంలో గుర్తించడం అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోవాలని సూచించారు.

Similar News

News March 29, 2026

విశాఖకు రోజుకు 33 విమానాలు..

image

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు నేటి నుంచి అక్టోబర్ 24 వరకు సమ్మర్ షెడ్యూల్ అమలు చేయనుంది. రోజుకు 33 విమానాలు నడవగా, ఇది వింటర్ షెడ్యూల్‌తో పోలిస్తే 10-15% పెరుగుదల. ఇండిగో అత్యధికంగా 21 సర్వీసులు నడుపనుంది. విశాఖ-అబుదాబి మధ్య వారానికి 4, సింగపూర్‌కు 4 సార్లు విమానాలు తిరగనున్నాయి. వారానికి హైదరాబాద్‌కు 61, ఢిల్లీకి 28, బెంగళూరుకు 27, ముంబైకు 6, విజయవాడ, తిరుపతి, కర్నూలుకు రోజువారీ కనెక్టివిటీ కొనసాగుతుంది.

News March 29, 2026

విశాఖకు రోజుకు 33 విమానాలు..

image

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు నేటి నుంచి అక్టోబర్ 24 వరకు సమ్మర్ షెడ్యూల్ అమలు చేయనుంది. రోజుకు 33 విమానాలు నడవగా, ఇది వింటర్ షెడ్యూల్‌తో పోలిస్తే 10-15% పెరుగుదల. ఇండిగో అత్యధికంగా 21 సర్వీసులు నడుపనుంది. విశాఖ-అబుదాబి మధ్య వారానికి 4, సింగపూర్‌కు 4 సార్లు విమానాలు తిరగనున్నాయి. వారానికి హైదరాబాద్‌కు 61, ఢిల్లీకి 28, బెంగళూరుకు 27, ముంబైకు 6, విజయవాడ, తిరుపతి, కర్నూలుకు రోజువారీ కనెక్టివిటీ కొనసాగుతుంది.

News March 29, 2026

కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు: జేసీ

image

విజయనగరం జిల్లాలో నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు JC సేధు మాధవన్ తెలిపారు. శనివారం JC కోర్టులో నిర్వహించిన విచారణలో జిల్లా ఆహార భద్రతాధికారి నాగల్ మీరా నమోదు చేసిన 10 ఫిర్యాదులపై విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై రూ.2,83,500ల జరిమానా విధించినట్లు ఆయన చెప్పారు. ఆహార పదార్థాల్లో కల్తీ, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.