News November 16, 2025
సంగారెడ్డి: జిల్లా విద్యాశాఖ ప్రత్యేక అధికారిగా రమేష్

ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు సంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారిగా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ నియమితులయ్యారు. ఈ నెల 17 నుంచి 22 వరకు 10 మండలాల్లోని 10 పాఠశాలల్లో ‘5.0’ కార్యక్రమాల అమలును ఆయన పరిశీలిస్తారని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీలకు సిద్ధంగా ఉండాలని ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు. తనిఖీల అనంతరం రమేష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 25, 2026
జగిత్యాల: వివిధ దినుసులు ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ.11,900, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,500, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,880, కనిష్ఠం రూ. 1,606, కందులు గరిష్ఠం రూ. 6,889, కనిష్ఠం రూ. 6,050, అనుములు గరిష్ఠం రూ. 5,152, కనిష్ఠం రూ. 4,000గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News March 25, 2026
రింకూకు KKR ప్రమోషన్

కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ను వైస్ కెప్టెన్గా నియమించింది. రహానే కెప్టెన్గా కొనసాగుతుండగా రింకూ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు. RCBకి వెళ్లిపోయిన వెంకటేష్ అయ్యర్ ప్లేస్ను రింకూ భర్తీ చేయబోతున్నారు. కేవలం ఫినిషర్గానే కాకుండా టీమ్ లీడర్గా రింకూను ఎదిగేలా చూడడమే ఫ్రాంచైజీ ప్లాన్.
News March 25, 2026
మెట్పల్లి: పసుపు క్వింటాల్ రూ.13,189

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 13,189, కనిష్ఠం రూ. 9,226, పసుపు గోళ గరిష్ఠం రూ. 11,688, కనిష్ఠం రూ. 9,111, పసుపు చూర గరిష్ఠం రూ. 11,405, కనిష్ఠం రూ. 8,829గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మార్కెట్లో మొత్తం 2,448 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.


