News November 16, 2025

NRPT: గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు: ఎస్పీ

image

తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందని మోసగాళ్లు చెప్పే గొలుసుకట్టు (Multi-Level Marketing) వ్యాపారాల జోలికి ప్రజలు వెళ్లవద్దని ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. ఈ వ్యాపారాల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రజలు మాయ మాటలు నమ్మి మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను కూడా నమ్మకూడదని తెలిపారు.

Similar News

News March 13, 2026

అమరావతి అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం

image

అమరావతి ప్రాంతంలోని మందడం దగ్గర జరిగిన భారీ మంటల ఘటనపై CM చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సమావేశంలోని టీ సమయంలో ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పరిశీలించాలని సూచించారు. నిర్మాణ పనులకు ఉపయోగించే సామగ్రి నిల్వ ఉన్న ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో జరిగిన నష్టం, పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు.

News March 13, 2026

నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్

image

డిప్యూటీ సీఎం పవన్ నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా అల్లూరి జిల్లాకి బయలుదేరుతారు. నందిగరువులో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి బేగంపేటకు తిరుగు పయనమవుతారు.

News March 13, 2026

KNR: బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’కు సవాళ్లు!

image

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈనెల 14న చేపట్టనున్న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’లో భాగంగా KNR నుంచి కొండగట్టు వరకు సాగే 40 కి.మీ పాదయాత్రపై భానుడి ప్రతాపం, ట్రాఫిక్ చిక్కుల ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఆరోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం, అదే రోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు సవాలుగా మారనున్నాయి. దీంతో యాత్ర సాగే తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.