News November 16, 2025

ఈ ఏడాది 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం: మంత్రి

image

జిల్లాలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి రైతు తన పంటను అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. గత ఏడాది 3.34లక్షల వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు.

Similar News

News March 14, 2026

VZM: సురక్షిత ఉత్పత్తులే లక్ష్యం.. మోసపోతే ప్రశ్నించండి

image

వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి వినియోగదారుడికి రక్షణ, సమాచారం, ఎంపిక, ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ‘సురక్షిత ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

News March 14, 2026

VZM: పోక్సో కోర్టులో ఈనెల 31న మొబైల్ ఫోన్ల వేలం

image

విజయనగరం జిల్లా పోక్సో కోర్టులో వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి ప్రభుత్వం జప్తు చేసిన మొబైల్ ఫోన్లను ఈ నెల 31న బహిరంగ వేలం వేయనున్నట్లు కోర్టు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 31 సాయంత్రం 4:30 గంటలకు కోర్టు ప్రాంగణంలోనే వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

News March 14, 2026

VZM: పోక్సో కోర్టులో ఈనెల 31న మొబైల్ ఫోన్ల వేలం

image

విజయనగరం జిల్లా పోక్సో కోర్టులో వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి ప్రభుత్వం జప్తు చేసిన మొబైల్ ఫోన్లను ఈ నెల 31న బహిరంగ వేలం వేయనున్నట్లు కోర్టు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 31 సాయంత్రం 4:30 గంటలకు కోర్టు ప్రాంగణంలోనే వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.