News November 16, 2025
HNK: కుటుంబ బంధాలు బలోపేతం: మంత్రి కొండా సురేఖ

వన భోజనాలతో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరిగి, కుటుంబ బంధాలు మరింత బలపడతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. చింతల్ గ్రౌండ్లో జరిగిన పద్మశాలి కార్తీకమాస వనభోజన మహోత్సవానికి ఆమె హాజరయ్యారు. పూర్వీకులు ఏర్పరచిన సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసేందుకు ఉద్దేశించినదే ఈ వనభోజన కార్యక్రమం అని, ఆచారాలను, సంప్రదాయాలను కొనసాగించాలని ఆమె కోరారు.
Similar News
News March 20, 2026
ఇచ్ఛాపురంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

ఇచ్ఛాపురంలో గురువారం రాత్రి జరిగిన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెల్లుపడ గ్రామానికి చెందిన ఉప్పాడ కుమార్ మృతి చెందారు. బైక్పై వస్తున్నా కుమార్ ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుమార్ బైక్ నుజ్జునుజ్జయిందని, తలకు బలమైన గాయం తగలడంతో స్థానికులు చూసే సరికి మృతిచెంది ఉన్నాడని ఎస్ఐ ముకుందరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News March 20, 2026
రోడ్లపై ఉమ్మినందుకు ₹3.44 లక్షల ఫైన్!

లండన్లోని రోడ్లపై పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు అధికారులు ₹3.44 లక్షల జరిమానా విధించారు. గతేడాది జూన్లో కింగ్స్బరీ రోడ్డులో అక్షిత్ కుమార్, నార్త్ వెంబ్లే స్టేషన్ వద్ద హితేశ్ పటేల్ ఉమ్మేశారు. దీంతో వారికి 100 పౌండ్ల(₹12,533) చొప్పున అధికారులు స్పాట్ ఫైన్ వేశారు. కానీ వాళ్లు చెల్లించకపోవడంతో 1,391 పౌండ్ల(₹1.72 లక్షలు) చొప్పున ఫైన్ వేస్తూ బ్రెంట్ కౌన్సిల్ ఆదేశాలిచ్చింది.
News March 20, 2026
హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు.. ఇరాన్ ప్లాన్!

ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. జలసంధిలో సముద్ర రవాణా భద్రత వల్ల లబ్ధి పొందుతున్న దేశాలు ఇరాన్కు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఓ చట్ట సభ్యుడు చెప్పినట్లు పేర్కొంది.


