News November 16, 2025

ఇంటి వస్తువులను పాదబాటలపై పెట్టవచ్చా?

image

జనరేటర్లు, షెడ్లను పాదబాటలపై ఏర్పాటు చేయడం వాస్తు విరుద్ధమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాన, ఎండ నుంచి రక్షణ కోసం పాదబాటలపై షెడ్ వేసినా, అది ప్రజల హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ‘ఇంటికి చెందిన ప్రతి వస్తువు, నిర్మాణం ఇంటి ప్రాంగణంలోనే ఉండాలి. వీధులను ఆక్రమిస్తే వాస్తు శక్తికి ఆటంకం కలుగుతుంది. ఎవరి పరిధిలో వారు ఉంటేనే వాస్తు ఫలితాలు పూర్తిగా లభిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

Similar News

News March 19, 2026

యుద్ధం ఎఫెక్ట్.. క్రికెట్ బంతుల కొరతపై ఆందోళన!

image

ప.ఆసియా ఉద్రిక్తతలతో UKలో డ్యూక్ క్రికెట్ బంతుల కొరత ఏర్పడింది. APR 3 నుంచి కౌంటీ సీజన్ ప్రారంభం కానుండగా బంతుల కొరతపై ఆందోళన మొదలైంది. బాల్స్ తయారయ్యే ద.ఆసియా నుంచి రవాణా జరగాల్సి ఉండగా మిడిల్ ఈస్ట్ రూట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ రూట్లను చూస్తున్నట్లు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ కంపెనీ ఓనర్ దిలీప్ జజోడియా తెలిపారు. విమానాల్లో తీసుకెళ్లాలంటే ఖర్చు 3 రెట్లు అధికం అవుతుందన్నారు.

News March 19, 2026

పార్టీల పంచాంగం.. అందరికీ శుభయోగమే!

image

TG: కాంగ్రెస్, BRS, BJP కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు భవిష్యత్ అంతా తమకే అనుకూలంగా ఉందని ప్రధాన పార్టీలకు వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రేవంత్ పాలనకు ఇబ్బంది లేదని గాంధీభవన్లో తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగి విపక్షానికి బలం పెరుగుతుందని BRS ఆఫీస్‌లో చెప్పగా.. ఈ ఏడాదీ కలిసివచ్చి దేశం, రాష్ట్రంలో BJP హవా ఉంటుందన్నారు. కవితకు ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు.

News March 19, 2026

అదృష్టంగా మారిన దురదృష్టం.. పదేళ్లుగా ఫ్రీగా గ్యాస్!

image

కేరళం ఆలప్పుళకు చెందిన రెత్నమ్మ 2011లో నీటి కోసం బోరు తవ్వించారు. కానీ నీరు పడలేదు. బోరు పైపును క్లోజ్ చేసే సమయంలో ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించగా పైపు నుంచి మంటలు వచ్చాయి. దీనిని గ్యాస్‌లా వాడుకోవచ్చని రెత్నమ్మ ఆ పైపును కిచెన్‌కు కనెక్ట్ చేసుకున్నారు. పదేళ్లు పైగా దానిని వాడుతూ ఏడాదికి రూ.10వేలు సేవ్ చేస్తున్నారు. బోరు నుంచి వచ్చేది మీథేన్ అని, కానీ అక్కడ భూగర్భ నిల్వలు లేవని అధికారులు తేల్చారు.