News November 16, 2025

మన్యం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షునిగా సంజీవరావు

image

పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి జివిఆర్ కిషోర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కే.సంజీవరావు, జనరల్ సెక్రటరీగా జి.చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్‌గా డబ్ల్యూవిఎస్‌ఎస్ శర్మ, ట్రెజరీగా వి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.కళ్యాణిదుర్గ ఎన్నికయ్యారు.

Similar News

News November 17, 2025

నేటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ

image

ఆసిఫాబాద్ జిల్లాలో జిన్నింగ్ (పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని ఆసిఫాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి అష్పక్ సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.

News November 17, 2025

ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా: బాలకృష్ణ

image

AP: ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటానని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నది తానొక్కడినేనని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘రాజకీయం అంటే ఏంటో ఎన్టీఆర్ నేర్పారు. బీసీలకు అధికారాన్ని పంచిన మహానుభావుడు’ అని అన్నారు. హిందూపురం ప్రజలకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.

News November 17, 2025

నవంబర్ 17: చరిత్రలో ఈరోజు

image

*1920: తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం
*1928: భారత జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణం (ఫొటోలో)
*1972: సినీ నటి, రాజకీయ నేత రోజా సెల్వమణి జననం
*1978: నటి కీర్తి రెడ్డి జననం
*1982: మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ జననం
*2012: శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మరణం
*అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం