News November 16, 2025
మన్యం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షునిగా సంజీవరావు

పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి జివిఆర్ కిషోర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కే.సంజీవరావు, జనరల్ సెక్రటరీగా జి.చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్గా డబ్ల్యూవిఎస్ఎస్ శర్మ, ట్రెజరీగా వి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.కళ్యాణిదుర్గ ఎన్నికయ్యారు.
Similar News
News March 21, 2026
ఎన్టీఆర్ జిల్లాలో సీఐల బదిలీ

ఎన్టీఆర్ జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుణదల సీఐగా సత్య రమేష్ను నియమిస్తున్నట్లు తెలిపారు. గుణదలలో ఉన్న వాసిరెడ్డి శ్రీనును సైబర్ క్రైమ్కు, అజిత్ సింగ్ నగర్ సీఐగా చంద్రశేఖర్, అజిత్ సింగ్ నగర్లో ఉన్న వెంకటేశ్వర్లను సీసీఎస్కు అటాచ్ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News March 21, 2026
ఏఐ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో నిర్వహించిన ఏఐ శిక్షణను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూర్తి చేశారు. మార్చి 16–20 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో డిజిటల్ పరిపాలన, కృత్రిమ మేధస్సు వినియోగంపై అవగాహన పొందారు. ఈ శిక్షణతో జిల్లాలో సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు సహాయపడుతుందని తెలిపారు.
News March 21, 2026
అనంత: టెస్సీ థామస్కు గౌరవ డాక్టరేట్

అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 6న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్ను ‘Missile Woman of India’గా పిలవబడే DRDO మాజీ డైరెక్టర్ జనరల్ టెస్సీ థామస్కు ఇవ్వనున్నారు. ఆమె గతంలో అగ్ని-IV, అగ్ని-V క్షిపణులకు ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు. దేశంలోని క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్త కూడా ఈమె కావడం విశేషం.


