News November 17, 2025
పాలనలో తెలుగును ప్రోత్సహించాలి: వెంకయ్య

భాష పోతే మన శ్వాస పోయినట్లేనని, తెలుగు పోతే మన వెలుగు పోయినట్లేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. అదే సమయంలో హిందీని వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు. మన ఎదుగుదలకు హిందీ కూడా ఎంతో అవసరమని తెలిపారు. రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. పాలనలో తెలుగును ప్రోత్సహించాలని, అన్ని ఆదేశాలూ తెలుగులోనే ఇచ్చేలా చొరవ తీసుకోవాలి AP, TG సీఎంలను కోరారు.
Similar News
News March 25, 2026
ఇందిరపై కామెంట్స్.. సభలో బీజేపీ Vs కాంగ్రెస్

TG: ఇందిరపై రాకేశ్ రెడ్డి <<19474706>>కామెంట్స్<<>> సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా ఎవరు చేసినా సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అనడంతో BRS MLA సంజయ్, BJP MLAలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి అడ్డుపడ్డారు. దీంతో వారిని కూర్చోండంటూ మంత్రి ఆగ్రహించారు. ఇక రాకేశ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి అన్నారు.
News March 25, 2026
పొదుపులో మహిళలు మహారాణులే.. కానీ!

డబ్బు దాచడంలో భారత మహిళలు ముందున్నా పెట్టుబడుల విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70%మంది మహిళలు పొదుపు చేస్తున్నారు. అయితే ఇందులో 40%మంది మాత్రమే FD, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులపై కాకుండా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవగాహన లేకపోవడం, నష్టభయం వల్ల చాలామంది వీటికే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది తమ ఆదాయంలో 10% కంటే తక్కువ పెట్టుబడి పెడుతున్నారట.
News March 25, 2026
ఇందిర అంటే గౌరవమే.. తప్పేమీ మాట్లాడలేదు: రాకేశ్ రెడ్డి

TG: అసెంబ్లీలో ఇందిరపై తన <<19474706>>వ్యాఖ్యల<<>> పట్ల దుమారం రేగడంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘ఇందిరా గాంధీ ఉక్కుమహిళ, ఆమె అంటే మాకు గౌరవమే. నేను తప్పేమీ మాట్లాడలేదు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇప్ప సారా తయారుచేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పా. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తా. తమాషా చేయొద్దని మంత్రి నన్ను బెదిరిస్తున్నారా?’ అని అన్నారు.


