News November 17, 2025

స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల విద్యార్థికి గోల్డ్ మెడల్

image

ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల మండలం దగ్గుమళ్లి వారిపాలెం విద్యార్థి శ్రీయాన్ ఆనంద్ సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ మురళి చెప్పారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన పోటీల్లో సబ్ జూనియర్స్ ఛాంపియన్షిప్-2025లో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడన్నారు. విజేతగా నిలిచిన విద్యార్థినిని పలువురు అభినందించారు.

Similar News

News March 31, 2026

మారేడుమిల్లి: ‘ఏకలవ్య పరీక్షలకు గంట ముందే చేరుకోవాలి’

image

పోలవరం జిల్లాలో ఏప్రిల్ 4న ఏకలవ్య విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష జరుగుతుందని జిల్లా పరీక్షల కన్వీనర్ శంకర్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 7 పరీక్ష కేంద్రాల్లో 1,445 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారని తెలిపారు. 100 మార్కులకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 11.40కు ప్రారంభం అవుతుందన్నారు. ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు.

News March 31, 2026

పెళ్లికి ముందు ఈ టెస్టులు చేయించుకోండి!

image

పెళ్లికి జాతకాలతో పాటు మెడికల్ టెస్టులు చేయించుకోవడం కూడా ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ స్థాయులు, HIV, హెపటైటిస్-B &C, VDRL, రుబెల్లా వంటి పరీక్షలు కాబోయే జంటలు చేయించుకోవాలి. ఇవి దంపతుల ఆరోగ్యానికే కాకుండా, పుట్టబోయే బిడ్డలకు జన్యుపరమైన లోపాలు, ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షణనిస్తాయి’ అని చెబుతున్నారు. SHARE IT

News March 31, 2026

హైదరాబాద్: RRR వెంబడి ‘డార్క్ జోన్’!

image

RRR వెంబడి భూములున్న రైతులకు షాక్ ఇచ్చేలా GOVT రహస్య GO రెడీ చేసిందని అంతర్గత సమాచారం. రోడ్డుకు ఇరువైపులా 2KM మేర బఫర్ జోన్‌గా ప్రకటించి PVT వెంచర్లకు పర్మిషన్లు నిలిపివేయబోతున్నారు. ఈ భూమిని భవిష్యత్తులో GOVT అవసరాల కోసం సేకరించాలని ప్లాన్. రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందనే భయంతో ఈ విషయాన్ని బయటపెట్టలేదు. సామాన్యుడు భూమిని అమ్ముకోలేని, కొనుక్కోలేని పరిస్థితి వస్తుందేమోనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.