News November 17, 2025
పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.
Similar News
News November 17, 2025
Wow.. సిద్దిపేట నుంచి ఇండియా టీంకు

అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.
News November 17, 2025
కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావొచ్చా?

కాశీని మనం మోక్ష నగరంగా పరిగణిస్తాం. ఇక్కడ ఉండే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అక్కడ మోక్షం పొందిన ఆత్మల శక్తి గంగాజలంలో ఉంటుందని పండితులు అంటారు. ఆ శక్తిని ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. అయితే హరిద్వార్, రిషికేశ్ వంటి ఇతర పవిత్ర నగరాల నుంచి గంగాజలం తేవడం శ్రేయస్కరం.
News November 17, 2025
శాలిగౌరారం: Way2News ఎఫెక్ట్.. ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం

శాలిగౌరారం(M) ఆకారం గ్రామంలో ఉన్న అతి పురాతనమైన సూర్య దేవాలయం జీర్ణోద్ధరణకు ఇక్కడి యువత నడుం బిగించింది. ఇటీవల Way2Newsలో ‘నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఆకారం, పెర్కకొండారం గ్రామానికి చెందిన 400 మంది యువకులు, యువజన సంఘాలు శ్రమదానం చేసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


