News April 12, 2024
ఐదేళ్లలో జగన్ ఎవరినైనా కలిశారా?: చంద్రబాబు

AP: గత ఐదేళ్లలో సీఎం జగన్ ఎవరినైనా కలిశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో టీడీపీ సభలో మాట్లాడిన ఆయన.. ‘కరవు, తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాన్ల కంటే అసమర్థ సీఎం వల్ల ఎక్కువ నష్టపోయారు. రాష్ట్రంలో ధాన్యం కొనే దిక్కు లేదు. తుపాను వల్ల నష్టపోతే పరామర్శించేందుకు సీఎం రాలేదు. ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
Similar News
News January 26, 2026
బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు

ఇంటర్నేషనల్ మార్కెట్లో చరిత్రలో తొలిసారి ఔన్స్ (28.35గ్రా) బంగారం $5,000కి (₹4.59L) చేరింది. ఒక ఔన్స్ సిల్వర్ $100గా ఉంది. 2025లో గోల్డ్ రేట్ 60%, వెండి 150% పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. US-NATO, ఇరాన్, గ్రీన్లాండ్ టెన్షన్స్, ట్రంప్ టారిఫ్స్ వంటివి దీనికి కారణాలుగా చెబుతున్నాయి. 2026 చివరికి బంగారం ఔన్స్ $5,400కి చేరొచ్చని అంచనా. ఈ పెరుగుదల భారత్ సహా ఇతర మార్కెట్లపైనా ప్రభావం చూపనుంది.
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<


