News April 12, 2024
ఐదేళ్లలో జగన్ ఎవరినైనా కలిశారా?: చంద్రబాబు

AP: గత ఐదేళ్లలో సీఎం జగన్ ఎవరినైనా కలిశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో టీడీపీ సభలో మాట్లాడిన ఆయన.. ‘కరవు, తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాన్ల కంటే అసమర్థ సీఎం వల్ల ఎక్కువ నష్టపోయారు. రాష్ట్రంలో ధాన్యం కొనే దిక్కు లేదు. తుపాను వల్ల నష్టపోతే పరామర్శించేందుకు సీఎం రాలేదు. ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
Similar News
News March 18, 2026
పెద్దపల్లి: ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో ఎల్పీజీ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళనతో ముందస్తు బుకింగ్లు చేయవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. 15 పంపిణీ కేంద్రాల ద్వారా 3-4 రోజుల్లోనే డెలివరీ జరుగుతుందని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో ఏవైనా సమస్యలుంటే 08728 224045 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
News March 18, 2026
భారత్లో తెలంగాణ అంతర్భాగం కాదా: మంత్రి పొన్నం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఫైరయ్యారు. ‘BJP నుంచి 8 మంది MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చారు? రావాల్సిన నిధులు చాలా పెండింగ్లో ఉన్నాయి. భారత్లో TG అంతర్భాగం కాదా? నిధులు ఎందుకు కేటాయించరు? రాష్ట్ర ఏర్పాటు విషయంలో తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని BJP కేంద్ర నేతలు అంటే రాష్ట్ర నేతలు ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు.
News March 18, 2026
ఇంటికే గ్యాస్.. ఏజెన్సీల వద్ద వేచి ఉండొద్దు: కేంద్రం

గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దని, సిలిండర్లను నేరుగా ఇంటికే పంపిణీ చేస్తామని వెల్లడించింది. IVRS, వాట్సాప్, మొబైల్ యాప్, <<19379922>>మిస్డ్కాల్<<>>, UPI యాప్స్ల ద్వారా బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.


