News November 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

image

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్‌కు తెలుస్తుందని తెలిపారు. సూరత్‌లోని రైల్వే కారిడార్‌లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.

Similar News

News March 13, 2026

డాల్బీ ఫార్మాట్‌లో ‘పెద్ది’

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అడ్వాన్స్‌డ్ డాల్బీ ఫార్మాట్‌లో విడుదల(ఏప్రిల్ 30) కానున్న తొలి టాలీవుడ్ మూవీగా నిలవనుంది. దీంతో హైపర్ రియలిస్టిక్ వీడియో, అద్భుతమైన సౌండ్‌తో చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు వార్-2, కాంతార-2, GOAT చిత్రాలు రిలీజయ్యాయి.

News March 13, 2026

8th క్లాస్‌తోనే ఐటీఐ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: 8వ తరగతిలోనే చదువు ఆపేసిన వారు జీవితంలో ఎదిగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8th క్లాస్ పాసైన వారూ ITI కోర్సుల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని HRD శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వారు ఇక్కడ చదువుతూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో టెన్త్ పాసయ్యేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే వృత్తి పనులు చేస్తున్నవారి స్కిల్స్ పరీక్షించి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు.

News March 13, 2026

వార్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్‌తో పాటు వంట నూనెల ధరలకూ రెక్కలొచ్చాయి. వివిధ రకాల నూనెల రేట్లు గత వారంతో పోలిస్తే కేజీపై ₹1-4 వరకు పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ ₹4, పామ్ ఆయిల్ ₹2.50, గ్రౌండ్‌నట్ ఆయిల్ ₹2, సోయాబీన్, వనస్పతి ఆయిల్ ₹1 చొప్పున పెరిగాయి. దేశంలో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్‌లో దాదాపు 90 శాతం అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం.