News November 17, 2025

పల్నాడు మహిళా పౌరుష స్ఫూర్తి.. మగువ మాంచాల

image

పల్నాడు మహిళల్లో నేడు కనిపిస్తున్న పౌరుషం, ఆత్మగౌరవానికి ప్రతీకగా మగువ మాంచాలని భావిస్తారు. నాటి పల్నాటి యుద్ధంలో మాచర్ల మహామంత్రి బ్రహ్మనాయుడు కోడలిగా, మహావీరుడు బాలచంద్రుడు భార్యగా ఆమె పాత్ర కీలకమైంది. ఆత్మాభిమానం గల మహిళగా ఆమె తన భర్త బాలచంద్రుడికి వీర తిలకం దిద్ది కథన రంగానికి పంపింది. యుద్ధంలో వీరోచితంగా పోరాడి బాలచంద్రుడు అసువులు బాసినప్పటికీ ఆమె చూపిన తెగువ నేటికీ కీర్తించబడుతోంది.

Similar News

News March 12, 2026

ఆసిఫాబాద్‌లో పదవ తరగతి పరీక్షల భద్రతా ఏర్పాట్లు

image

ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి (ఎస్‌ఎస్‌సి) పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని, కర్రలు, ఆయుధాలు, రాళ్లు, జిరాక్స్ సెంటర్లపై కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

News March 12, 2026

ఫోన్ పే, గూగుల్ పే‌లో కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా?

image

ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిలో కరెంట్ బిల్లుల చెల్లింపు ఆప్షన్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో లాగా బిల్ జనరేట్ అవ్వడం లేదని, తాత్కాలికంగా బిల్లర్ డౌన్ అంటూ చూపుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? అయితే విద్యుత్ శాఖ అఫీషియల్ యాప్‌లో పవర్ బిల్ పే చేయొచ్చు.

News March 12, 2026

జగిత్యాల: నేరాల నివారణతో పాటు కేసులు త్వరితగతిన ఛేదించాలి

image

నేరాల నివారణతో పాటు జరిగిన నేరాలను వేగంగా ఛేదించి బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్ అధికారులు పని చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు.