News November 17, 2025
యాదాద్రి: నేటి నుంచి పత్తి మిల్లులు బంద్

నేటి నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిల్లుల అసోసియేషన్ నిరవధిక బంద్ను పాటించనున్నట్లు పత్తి మిల్లుల అసోసియేషన్ తెలిపింది. కావున రైతులెవరూ మార్కెట్ యార్డ్కు పత్తిని తీసుకురావద్దని మిల్లుల యాజమాన్యం కోరింది. దీంతో ఇప్పటికే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న పత్తి రైతులు ఏం చేయాలో తెలీక అయోమయంలో పడిపోయారు. అధికారులు త్వరగా చర్చలు జరిపి మిల్లులు తెరుచుకునేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News March 13, 2026
సిద్దిపేట: ‘లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి’

28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్లో క్రిమినల్, కంపౌండ్డబుల్, సివిల్, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలన్నారు.
News March 13, 2026
KMR: ఇంటర్ పరీక్షలు.. 97.46% హాజరు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,649 మంది విద్యార్థులకు గాను 7,455 మంది హాజరయ్యారని, 194 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 97.46 శాతం హాజరు నమోదైందని ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
News March 13, 2026
HNK: ఇంటర్ పరీక్షకు 17,931 విద్యార్థులు హాజరు

హనుమకొండ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 17,931 మంది విద్యార్థులు హాజరుకాగా 98 శాతం హాజరు నమోదయింది. 17,203 మంది జనరల్ విద్యార్థులు, 728 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 393 మంది జనరల్ విద్యార్థులు, 26 మంది ఒకేషనల్ విద్యార్థులు నేటి పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.


