News November 17, 2025
సీసీఐ నిబంధనలపై నిరసన.. నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

ఖమ్మం: సీసీఐ విధించిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాటన్ ట్రేడర్స్, మిల్లర్స్ అసోసియేషన్ నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జిన్నింగ్ మిల్లులను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొనుగోళ్లు ఆగిపోతే రైతులకు మద్దతు ధర దక్కదని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 5, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో 26 పోస్టులు

<
News March 5, 2026
9న భీమవరం వస్తున్న షర్మిల!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
News March 5, 2026
ఖమ్మం: సర్కారు దవాఖానలో ‘దాహ’ మంటలు..

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాగునీటి ఎద్దడి రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వందలాది మంది రోగులు, వారి సహాయకులకు కనీసం మంచినీరు కూడా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో బయట నీళ్ల బాటిళ్లు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన ఆర్ఓ (RO) ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో ఈ దుస్థితి నెలకొంది.


