News November 17, 2025
NLG: సన్నాల సాగుకే సై! కారణమదే…

జిల్లాలో రైతులు సన్నాల సాగుపై దృష్టి సారిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా సన్నాలైన చిట్టిపొట్టి, బీపీటీ, చింట్లు తదితర సన్నరకాలను సాగు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. సన్నాలను తేమ శాతం ఎక్కువ ఉన్నా మిల్లర్లే మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో.. రైతులు సాగు చేస్తున్న వరిలో 60 శాతం వరకు సన్నాలే ఉండడం గమనార్హం. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది.
Similar News
News March 13, 2026
8th క్లాస్తోనే ఐటీఐ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: 8వ తరగతిలోనే చదువు ఆపేసిన వారు జీవితంలో ఎదిగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8th క్లాస్ పాసైన వారూ ITI కోర్సుల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని HRD శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వారు ఇక్కడ చదువుతూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో టెన్త్ పాసయ్యేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే వృత్తి పనులు చేస్తున్నవారి స్కిల్స్ పరీక్షించి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు.
News March 13, 2026
విశాఖ: షాపుల ముందు చెత్త వేస్తున్నారా? రూ.5000 జరిమానా తప్పదు!

వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం 20వ వార్డులో పర్యటించిన ఆయన, రోడ్లపై వ్యర్థాలు వేసిన బ్లింకిట్ అవుట్లెట్కు రూ.10 వేలు, పాన్ షాపునకు రూ.5 వేల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వాణిజ్య సముదాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్లాప్ వాహనాలు సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు
News March 13, 2026
TTD ఛైర్మన్ బ్యానర్ పెట్టారని పోలీస్ కేసు

TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు కనబడటం లేదని తిరుపతిలోని ఏడీ బిల్డింగ్ వద్ద బుధవారం బ్యానర్ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ వీజీవో గిరిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన అజయ్ కుమార్, పసుపులేటి సురేశ్, వాసు యాదవ్, నల్లాని బాబు, ఉదయ్ వంశీతో పాటు మరికొందరు ఫ్లెక్సీ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.


