News November 17, 2025

అల్లూరి: బర్త్‌డే కేకు తిన్న విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత

image

కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 24 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి పాఠశాలలో ఓ విద్యార్థిని బర్త్ డే సందర్భంగా కట్ చేసిన కేకును తిని, విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. విషమంగా ఉన్న ఇద్దరు విద్యార్థులను ఆదివారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News March 25, 2026

మునగాల సాగర్ ఎడమ కాలవలో మృతదేహం

image

మునగాల మండల పరిధిలోని సాగర్ ఎడమ కాలవలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం కాలవ వద్దకు వెళ్లిన రైతులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి వెంటనే గ్రామస్థులకు, సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2026

పరిమితి దాటిన వైద్యం.. ప్రాణాల మీదకు తెస్తున్న ఆర్ఎంపీలు!

image

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్‌లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News March 25, 2026

పరిమితి దాటిన వైద్యం.. ప్రాణాల మీదకు తెస్తున్న ఆర్ఎంపీలు!

image

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్‌లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.