News November 17, 2025
మెగాస్టార్ చిరంజీవి మన పల్నాడులో చదువుకున్నారని మీకు తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి మన పల్నాడులో విద్యాభ్యాసం చేశారు. చిరంజీవి తండ్రి వెంకట్రావు గురజాల ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేశారు. ఆ సమయంలో చిరంజీవి గురజాల దుగ్గరాజు వారి సందులోని కిష్టయ్య పాఠశాలలో వరప్రసాద్ పేరుతో చదువుకున్నారు. ఆయన గురజాలకు వచ్చినప్పుడు తాను చదువుకున్న పాఠశాలను, పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని గుర్తు చేసుకున్నారు.
Similar News
News November 17, 2025
తారా కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

సంగారెడ్డిలోని తారా పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. వివిధ కోర్సుల్లో మొత్తం 285 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్లంలో 27, తెలుగులో 21, రాజనీతి శాస్త్రంలో 37, ఎం.కాం.లో 26, బోటనీలో 22, కంప్యూటర్ సైన్స్లో 47, ఫిజిక్స్లో 46, మ్యాథమెటిక్స్లో 47, జువాలజీలో 12 సీట్లు ఉండగా అర్హులు ఈ నెల 18లోగా అప్లయి చేసుకోవాలన్నారు.
News November 17, 2025
తారా కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

సంగారెడ్డిలోని తారా పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. వివిధ కోర్సుల్లో మొత్తం 285 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్లంలో 27, తెలుగులో 21, రాజనీతి శాస్త్రంలో 37, ఎం.కాం.లో 26, బోటనీలో 22, కంప్యూటర్ సైన్స్లో 47, ఫిజిక్స్లో 46, మ్యాథమెటిక్స్లో 47, జువాలజీలో 12 సీట్లు ఉండగా అర్హులు ఈ నెల 18లోగా అప్లయి చేసుకోవాలన్నారు.
News November 17, 2025
కామారెడ్డి ప్రజావాణికి 87 దరఖాస్తులు

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 87 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.


