News November 17, 2025
సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.
Similar News
News March 4, 2026
ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్లో 30 పోస్టులు..

<
News March 4, 2026
సౌతాఫ్రికాతో సెమీస్.. టాస్ గెలిచిన NZ

T20WC: కోల్కతాలో జరగనున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
సౌతాఫ్రికా: మార్క్రమ్ (C), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, రబాడ, జాన్సెన్, కేశవ్ మహరాజ్, బాష్, లుంగి ఎంగిడి.
న్యూజిలాండ్: సీఫర్ట్, అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, నీషమ్, శాంట్నర్ (C), మెక్కొంచి, హెన్రీ, ఫెర్గ్యూసన్.
News March 4, 2026
30,588 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం

AP: వైసీపీ హయాంలో జాకీ, లులు, అమర్రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి అనేక కంపెనీలను తరిమేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక అనేక సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ‘మేం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 30,588 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. పరిశ్రమలు, సంస్థల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి’ అని తెలిపారు.


