News November 17, 2025
అలా చేస్తేనే తిరుపతి యాత్ర పూర్తవుతుందట..!

పరమపావనమైన పురుషోత్తముడి దర్శనానికి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. పూర్వం సౌకర్యాలు లేకపోవడంతో తిరుచానూరులోనే వేంకన్న దర్శనం జరిగేది. తిరుమలకు సౌకర్యాలు మెరుగుపడడంతో భక్తులు అక్కడ స్వామివారిని.. తిరుచానూరులో పట్టపురాణి దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతి యాత్ర సంపూర్ణం కావాలంటే ఇద్దరిని దర్శించుకోవాలని పలువురు చెబుతున్నారు. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరుకు వస్తుంటారు.
Similar News
News March 23, 2026
యుద్ధం.. సామాన్యుడిపై భారం పడకుండా మోదీ ప్లాన్!

యుద్ధం కారణంగా ఎరువులు, ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత రాకుండా మోదీ అధికారులను అలర్ట్ చేశారు. ఖరీఫ్ కోసం ఎరువుల నిల్వలు పెంచాలని, విద్యుత్ కొరత రాకుండా బొగ్గు సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫార్మా, కెమికల్ రంగాలకు కావాల్సిన ముడి పదార్థాల కోసం ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయాలను వెతకాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.
News March 23, 2026
కట్టంగూరు: స్విమ్మింగ్ పూల్లో మాజీ సైనికుడి మృతి

కట్టంగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బెల్లి జనార్ధన్ (50) ఆదివారం సాయంత్రం కట్టంగూరులోని ఒక స్విమ్మింగ్ పూల్కు ఈతకు వెళ్లారు. నీటిలో ఈత కొడుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News March 23, 2026
ఇందూరులో ‘డబుల్’ చుట్టే రాజకీయం..!

నిజామాబాద్ అర్బన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వేలాది మంది పేదలు దరఖాస్తు చేసుకున్నా, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిర్మాణం పూర్తైన ఇళ్లను వెంటనే కేటాయించాలని ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అటు అధికార పక్షం పారదర్శకంగానే ప్రక్రియ సాగుతోందని చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అసలైన అర్హులెవరో తేల్చడం అధికారులకు సవాలుగా మారింది.


