News November 17, 2025
అరకు, లంబసింగిలో కారవాన్ పార్కులు

ఏపీలో మొదటిసారిగా అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్లలో కారవాన్ పార్క్లు ఏర్పడనున్నాయి. పర్యాటకులకు చిన్న మొబైల్ హౌస్లా ఉండే కారవాన్ల్లో సురక్షితంగా ఉండే అవకాశం కలుతుందని అధికారులు తెలిపారు. లంబసింగిలో పైలట్గా 10-15 ఈ-కారవాన్ వాహనాలు అందించనున్నారు. మొత్తం మూడు పార్కులకు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టబడుతోంది. హోటల్ సౌకర్యాలు తక్కువైన ప్రాంతాల్లో ఇది కొత్త అనుభవం కానుంది.
Similar News
News March 18, 2026
పిడుగుపాటుకు బాపట్ల జిల్లా మహిళ మృతి

భట్టిప్రోలు (M) రాచూరు పొలంలో పని చేస్తున్న మహిళా కూలిపై బుధవారం పిడుగుపడి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. నగరం (M) ధూళిపూడికి చెందిన వనజ (35) మినుము పంటలో పనిచేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురైంది. గాయపడిన ఆమెను ధూళిపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని PHCకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె తరలించారు.
News March 18, 2026
విశాఖ: దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం ప్రారంభం

దివ్యాంగుల కోసం ఏపీ ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని బుధవారం ప్రారంభించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల రవాణా సమస్యలు తగ్గి, సామాజిక-ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News March 18, 2026
వనపర్తి: DHTT కోర్సులో ప్రవేశాలు: కలెక్టర్

చేనేత రంగంలో నైపుణ్యాలను సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు యువత ముందుకు రావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. హైదరాబాదులోని కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లమా కోర్సులో ప్రవేశాలకు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న నోటిఫికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


